8, నవంబర్ 2010, సోమవారం

భరతమాతకు భవితనివ్వు.....

బుక్కెడు కూడుకు దిక్కులేని జనం ఆకలికి అలమటిస్తుంటే,
పైసల కట్టలకు ప్రాణం వచ్చి పరాయిల పాలై పోతుంటే,
కుప్పలు తెప్పలుగా బలైపోతున్న జీవుల చావుల లెక్కలు కడుతుంటే,
ఆవేశం కడలి కెరటంలా కన్నుల్లో ఉప్పొంగుతోంది,
ఆవేదన అగ్నిజ్వాలలా మనసును దహించివేస్తుంది,
ఆక్రోదం కట్టలు తెంచుకుని అంతిమ యాత్రకు పరిగెడుతుంది....
బ్రతుకంటే జుదమేనా?????????.
మానవత్వమా నీవెక్కడ !!!
నీకు ప్రాణముంటే,
పంచబూతాల సాక్షిగా,
మువ్వన్నెల పతాకం సాక్షిగా,
కదులు, మౌనం వదులు.....
శిలలా మిగిలిన భరతమాతకు భవితనివ్వు.....

కామెంట్‌లు లేవు: