మనల్ని మనం వెతుక్కోవడం కోసం
ఒక అత్యద్భుత ఒంటరితనం కోసం
అప్పుడప్పుడు కొన్ని మైళ్ల దూరం
ప్రయాణవౌతాం.
ఒంటరిగా నిలబడ్డ చెట్టును చూస్తాం
నిర్మలంగా వున్న ఆకాశాన్ని చూస్తాం
లక్ష్యం వైపు సాగే పక్షిని చూస్తాం.
ఆలోచనల్లో స్నానించి
కొత్త పరిమళాన్ని నింపుకొని
మళ్లీ కొత్తగా విరబూస్తాం
మానవ సమూహంలోకి
చిరునవ్వులమై ప్రవహిస్తాం.
వినుడు.. వినుడు..
-జగద్ధాత్రి
మాది లౌకిక రాజ్యం
అందుకే మాకు తన పర భేదాల్లేవు
గుళ్లూ గోపురాలూ
మసీదులూ దర్గాలూ
గురుద్వారాలూ, చర్చిలూ
బౌద్ధ ఆరామాలూ, జైన ఆలయాలూ
దేన్నీ వదలం సుమా
ఎందుకంటే మేము
సర్వ మత సమానత్వమున్నవాళ్లం
అన్నిటినీ సమదృష్టితోనే
వినాశనం చేస్తాం
కుల వర్ణ భేదాలూ లేవు మాకు
భారత రత్నాలకు పాదరక్షల దండ వేస్తాం
జాతి రత్నాలను అవమానిస్తాం
అమానుషత్వ పరాకాష్ట చూస్తాం
వర్గ భేదాలూ లేని సౌభ్రాతృత్వ దేశం మాది
పేదవాణ్ణి శాయశక్తులా
వాడి స్థితి మారకుండా చూస్తాం
గొప్పోడిని మాత్రం తేడా చూపిస్తామా ఛఛా
మాకలాంటి కుయుక్తులు లేవు
వాడినెప్పుడూ గొప్పగానే ఉంచుతాము
అన్నం పెట్టే చేతులు
ఆశలొదిలి ఆత్మహత్యలు చేసుకుంటే
ఊరుకుంటామా
మొసలి కన్నీళ్లు కార్చి మరీ వస్తాం
అధికారుల దురాశకు బలై పోయి
ఆధ్యాత్మికానికి బదులు అంతిమ యాత్రకు వెళ్లిన
వేల మంది మా తోటివాళ్లను
మా నేతలు హెలీకాప్టర్ల నుండి
పర్యవేక్షిస్తారండీ పాపం
మావి జాలి గుండెలు సుమండీ
అసలే అత్యంత ప్రాచీన సంస్కృతి మాది
అందుకే ఎప్పుడూ తాతల నేతులను
గూర్చి కథలు కథలుగా
చరిత్ర కెక్కిస్తాము
మాది పశ్చిమ వికృత సంస్కృతి కాదు
ఏదో ప్రపంచీకరణలో
ఇంతటి దేశం లేకుంటే ఎలా అని
మా పిల్లల్నీ, మనమల్నీ
విదేశాలు కూలికి పంపుతున్నాం
ప్రపంచ మార్కెట్లో వస్తువులుగా
నిలబెడుతున్నాం
ఎన్నిమార్లు ఎన్ని ప్రమాదాల్లో
మమ్మల్ని చంపినా
కలియుగం ఒకేసారి అంతం కాదట
అందుకే ఇలా దఫదఫాలుగా
భూకంపాలు, హిమాలయ సునామీలు
రూపంలో ఆ పరమాత్మ
మోక్షం ప్రసాదిస్తున్నాడని
కాశీ గంగలో మునక వేసి
తర్పణాలొదులుతున్నాం
ప్రకృతి తీవ్రవాదానికి
భగవంతుణ్ణే బాధ్యుణ్ణి చేస్తాం
ఇక మా ప్రభుత్వం గురించి మరి కొంచెం వినండి
మార్పు కోసం చర్చలు జరుపుతుంటాం
పరిమార్చడంలో ఏ చర్చలూ లేవని తెలుపుతుంటాం
ఇవండీ మా సంగతులు
ఏదో మచ్చుకి కొన్ని చెప్పానంతే
మరీ గొప్పలు చెప్పుకోవడానికి
మాకు మొహమాటం కూడానూ
అందుకే ఇక రాబోయే ఎన్నికల కోసం
మా నేతలు మాకు నేస్తాల్లా నటిస్తూ
మమ్మల్నిప్పటినుండే
బుట్టలో వెయ్యడానికి ఎన్ని పాట్లు
పడుతున్నారో చెప్పానా?
లేదే! ఎంతైనా మరీ బడాయి పోవడం
ఎందుకులెండని మనసు కట్టుకుని ఊరుకున్నా
మాది రత్నగర్భ భారతం అవునో కాదో గానీ
నిత్యం భేతాళుడి శవంలాగా
మా శవాలను మేమే
మా తల్లికి కానుకగా ఇచ్చి
ఆమె కంట నీరు ఆగకుండా చూస్తాం
అందులో మాత్రం ఎవ్వరికీ తీసిపోము
మాది అత్యంత ప్రజాస్వామిక దేశం
ఎక్కడా ఎందులోనూ
తారతమ్యాలుండవు సుమా!!
ఒక అత్యద్భుత ఒంటరితనం కోసం
అప్పుడప్పుడు కొన్ని మైళ్ల దూరం
ప్రయాణవౌతాం.
ఒంటరిగా నిలబడ్డ చెట్టును చూస్తాం
నిర్మలంగా వున్న ఆకాశాన్ని చూస్తాం
లక్ష్యం వైపు సాగే పక్షిని చూస్తాం.
ఆలోచనల్లో స్నానించి
కొత్త పరిమళాన్ని నింపుకొని
మళ్లీ కొత్తగా విరబూస్తాం
మానవ సమూహంలోకి
చిరునవ్వులమై ప్రవహిస్తాం.
వినుడు.. వినుడు..
-జగద్ధాత్రి
మాది లౌకిక రాజ్యం
అందుకే మాకు తన పర భేదాల్లేవు
గుళ్లూ గోపురాలూ
మసీదులూ దర్గాలూ
గురుద్వారాలూ, చర్చిలూ
బౌద్ధ ఆరామాలూ, జైన ఆలయాలూ
దేన్నీ వదలం సుమా
ఎందుకంటే మేము
సర్వ మత సమానత్వమున్నవాళ్లం
అన్నిటినీ సమదృష్టితోనే
వినాశనం చేస్తాం
కుల వర్ణ భేదాలూ లేవు మాకు
భారత రత్నాలకు పాదరక్షల దండ వేస్తాం
జాతి రత్నాలను అవమానిస్తాం
అమానుషత్వ పరాకాష్ట చూస్తాం
వర్గ భేదాలూ లేని సౌభ్రాతృత్వ దేశం మాది
పేదవాణ్ణి శాయశక్తులా
వాడి స్థితి మారకుండా చూస్తాం
గొప్పోడిని మాత్రం తేడా చూపిస్తామా ఛఛా
మాకలాంటి కుయుక్తులు లేవు
వాడినెప్పుడూ గొప్పగానే ఉంచుతాము
అన్నం పెట్టే చేతులు
ఆశలొదిలి ఆత్మహత్యలు చేసుకుంటే
ఊరుకుంటామా
మొసలి కన్నీళ్లు కార్చి మరీ వస్తాం
అధికారుల దురాశకు బలై పోయి
ఆధ్యాత్మికానికి బదులు అంతిమ యాత్రకు వెళ్లిన
వేల మంది మా తోటివాళ్లను
మా నేతలు హెలీకాప్టర్ల నుండి
పర్యవేక్షిస్తారండీ పాపం
మావి జాలి గుండెలు సుమండీ
అసలే అత్యంత ప్రాచీన సంస్కృతి మాది
అందుకే ఎప్పుడూ తాతల నేతులను
గూర్చి కథలు కథలుగా
చరిత్ర కెక్కిస్తాము
మాది పశ్చిమ వికృత సంస్కృతి కాదు
ఏదో ప్రపంచీకరణలో
ఇంతటి దేశం లేకుంటే ఎలా అని
మా పిల్లల్నీ, మనమల్నీ
విదేశాలు కూలికి పంపుతున్నాం
ప్రపంచ మార్కెట్లో వస్తువులుగా
నిలబెడుతున్నాం
ఎన్నిమార్లు ఎన్ని ప్రమాదాల్లో
మమ్మల్ని చంపినా
కలియుగం ఒకేసారి అంతం కాదట
అందుకే ఇలా దఫదఫాలుగా
భూకంపాలు, హిమాలయ సునామీలు
రూపంలో ఆ పరమాత్మ
మోక్షం ప్రసాదిస్తున్నాడని
కాశీ గంగలో మునక వేసి
తర్పణాలొదులుతున్నాం
ప్రకృతి తీవ్రవాదానికి
భగవంతుణ్ణే బాధ్యుణ్ణి చేస్తాం
ఇక మా ప్రభుత్వం గురించి మరి కొంచెం వినండి
మార్పు కోసం చర్చలు జరుపుతుంటాం
పరిమార్చడంలో ఏ చర్చలూ లేవని తెలుపుతుంటాం
ఇవండీ మా సంగతులు
ఏదో మచ్చుకి కొన్ని చెప్పానంతే
మరీ గొప్పలు చెప్పుకోవడానికి
మాకు మొహమాటం కూడానూ
అందుకే ఇక రాబోయే ఎన్నికల కోసం
మా నేతలు మాకు నేస్తాల్లా నటిస్తూ
మమ్మల్నిప్పటినుండే
బుట్టలో వెయ్యడానికి ఎన్ని పాట్లు
పడుతున్నారో చెప్పానా?
లేదే! ఎంతైనా మరీ బడాయి పోవడం
ఎందుకులెండని మనసు కట్టుకుని ఊరుకున్నా
మాది రత్నగర్భ భారతం అవునో కాదో గానీ
నిత్యం భేతాళుడి శవంలాగా
మా శవాలను మేమే
మా తల్లికి కానుకగా ఇచ్చి
ఆమె కంట నీరు ఆగకుండా చూస్తాం
అందులో మాత్రం ఎవ్వరికీ తీసిపోము
మాది అత్యంత ప్రజాస్వామిక దేశం
ఎక్కడా ఎందులోనూ
తారతమ్యాలుండవు సుమా!!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి