ఒక కన్ను పోయిన రాజు తన ఆస్థాన కవులను, అతని కళ్ళను పొగుడుతూ పద్యం రాయమన్నాడుట. రాయలేని వారందరూ శిక్షార్హులు. అప్పుడు ఒక కవి ఈ చాటువు వ్రాసారు.
"అన్నాతి గూడ హరుడవే
అన్నాతిని గూడనప్పు డసుర గురుడవే
అన్నా! తిరుమల రాయా!
కన్నొక్కటి మిగిలె గాని కౌరవ పతివే !"
" మీ శ్రీమతి పక్కనుంటే, ఆవిడ కళ్ళతో కలిపి ముక్కంటివి, లేకపోతె, ఒక్క కంటితో శుక్రాచార్యుడంతటి వాడివి, ఆ దిక్కుమాలిన ఒక్క కన్ను మిగిలింది కాని, లేకపోతె, ద్రుతరష్టుడంతటి వాడివి అయ్యేవడివి."
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి