3, ఫిబ్రవరి 2012, శుక్రవారం

రధ సప్తమి - 30.01.2012

సాక్ష్యాత్తు శ్రీ మన్నారాయణ స్వరూపుడైన శ్రీ సూర్య భగవానుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడై శ్రీసూర్య భగవానుడు జన్మించిన మాఘశుద్ధ సప్తమి పర్వదినమే రధ సప్తమి. వివిధ దేశాలు, విభిన్న వ్యక్తులు, అనేక కుల మతాలు, రకరకాల జీవ రాసులు, ఇలా ఎన్నో, ఎన్నెన్నో రకాలు ఉన్నా, అందరికీ, అన్నిటికీ..., ప్రపంచ మంతటికీ, ఉనికినీ, మనుగడనీ,ప్రసాదించేది ఒక్క సూర్య భగవానుడే. ఆయనే మనకు ప్రత్యక్ష దైవం. జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాల నియమానికీ, ఆరోగ్యానికీ, అన్నిటికీ ఆ సూర్యుడే. సూర్యుడు లేనిదే జగత్తు లేదు. సూర్యుడు అతిధి కశ్యపుల కుమారుడు. అందుకే ఆయన ఆదిత్యుడు. కర్మ సాక్షి ఐన మన సూర్య భగవానుడు, కుసుమ వర్ణంతో ఉంటాడు. ఉదయం బ్రహ్మ స్వరూపం మధ్యాహ్నంతు మహేశ్వరం సాయంకాలే స్వయం విష్ణుః త్రిముర్తిస్తూ దివాకరః సూర్యుడు దక్షిణాయణం ముగించుకుని, ఉత్తరాయణంలో ప్రవేశించటానికి సూచనగా మనం రెండు పర్వదినాలను జరుపుకుంటాం. ఒకటి సంక్రాంతి రెండవది రథ సప్తమి. సప్తమి సూర్యుని జన్మ తిధి. ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు, జరుపుకునే రథ సప్తమి సూర్య సంబంధమైన పండుగ. జపా కుసుమ సంకాశం, కాశ్యపేయం మహాద్భుతం తమోరిం సర్వ పాపఘ్నం 






ప్రణతోస్మి దివాకరం 

కామెంట్‌లు లేవు: