రాసేవాన్ని కవితలు కావులే
మదిని కదిలించే మధుర భావాలను
అక్షరాల రాసులుగా చేసి వాటినే
అందమైన వరసలుగా అమర్చితే
అది చదివే వారి మది పులకించి
ఆ మధురాను భావాన్ని వారూ అనుభవిస్తే
దానికి గురుతుగా వారి పెదవుల ఫై
నిలుస్తుంది లే ఒక చిన్న చిరునవ్వు
అది చెదిరి పోదులే ఆ కవిత గురుతున్నంత వరకు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి